డ్రస్సింగ్ రూంలో రోహిత్ శర్మ ఏడుస్తూ.. వీడియో వైరల్

డ్రస్సింగ్ రూంలో రోహిత్ శర్మ ఏడుస్తూ.. వీడియో వైరల్

ముంభై ఇండియాన్స్ మాజీ కెప్టెన్‌ రోహిత్ శర్మ ఐపీఎల్ మ్యాచ్లుల్లో వరుసగా తన ఫర్ఫామెన్స్ తగ్గుతుంది. ఐపీఎల్ 2024 ప్రారంభ మ్యాచుల్లో బాగా ఆడినా రోహిత్ శ‌ర్మ ఆ త‌ర్వాత ప‌రుగులు చేయ‌డానికి ఇబ్బంది ప‌డుతున్నాడు. ఐపీఎల్ 2024లో  హిట్ మాన్ చివరి 5 ఇన్నింగ్స్‌లలో కేవలం 34 పరుగులు మాత్రమే చేశాడు.. రానురాను ఆయన స్కోర్ సింగల్ డిజిట్ కే పడిపోతుంది. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. 

ఐపీఎల్ 2024లో సోమవారం రాత్రి  వాంఖడే స్టేడియంలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో జ‌రిగిన‌ మ్యాచ్‌లో కేవలం ఐదు బంతుల్లో 4 పరుగులకే ఔటయ్యాడు.  ఈ క్రమంలోనే రోహిత్ శర్మ డ్రస్సింగ్ రూంలో ఏడుస్తూ ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది నిజమా కాదా అనే విషయం మాత్రం తెలియదు. ఆ వీడియోకు సోషల్ మీడియాలో చాలామంది రియాక్ట్ అవుతున్నారు.

2023 ఐపీఎల్ వరకు ముంభై ఇండియన్స్ టీం కాప్టెన్ గా ఉన్న ఆయన ఈసారి ప్లేయ‌ర్ గా ఆడుతున్నాడు. అయితే, హిట్ మ్యాన్ ఇండియా టీం కెప్టెన్ గా మరో ఐసిసి టోర్నీకి బాధ్యతలు చేపట్టనున్నాడు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 లో రోహిత్ కెప్టెన్సీలో భారత్ ఫేవరెట్‌గా బ‌రిలోకి దిగుతోంది. టీ20 ప్రపంచకప్ వ‌చ్చే నెల‌లో ప్రారంభం కానున్న స‌మ‌యంలో రోహిత్ శర్మ ఫామ్‌పై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఫ్యాన్స్ ను మెప్పించేందుకు ఇటీవల భారీ స్కోర్ తో రాణించడం లేదు.