ఈనెల 3 నుంచి ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ ప్రాక్టికల్స్

ఈనెల 3 నుంచి ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ ప్రాక్టికల్స్

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ సెకండియర్​లో ఉన్న ఒకేషనల్ గ్రూప్ స్టూడెంట్లకు ఫస్టియర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 3 నుంచి 7 దాకా జరుగుతాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 49వేల మంది ఒకేషనల్ గ్రూప్ స్టూడెంట్లు ఉన్నారు. ప్రస్తుతం సెకండియర్​లో ఉన్న వీళ్లకు కరోనా కారణంగా ఫస్టియర్​లో ప్రాక్టికల్స్ జరపలేదు. ఇప్పటికే అన్ని గ్రూప్​లకు ఫస్టియర్ పరీక్షలు నిర్వహించిన ఇంటర్ బోర్డు ఈ నెల 2న ఫలితాలను రిలీజ్ చేసేందుకు కసరత్తు చేయగా, ఒకేషనల్ ప్రాక్టికల్స్ పెట్టిన తర్వాతే రిజల్ట్ ఇవ్వాలని సర్కారు ఆదేశించింది. ఒకేషనల్ స్టూడెంట్లకు ప్రాక్టికల్స్ పెట్టకుండా, పూర్తి మార్కులు వేయాలని బోర్డు అధికారులు భావించినా, సర్కారు పెద్దలు అందుకు అంగీకరించలేదు. దీంతో బోర్డు అధికారులు ప్రాక్టికల్స్ నిర్వహణకు రెడీ అయ్యారు.