మెట్రో రైలు సేవలకు అంతరాయం: ఇబ్బందుల్లో ప్రయాణికులు

మెట్రో రైలు సేవలకు అంతరాయం: ఇబ్బందుల్లో ప్రయాణికులు
హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మరోసారి కొంత టైం మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి. ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం కారిడార్లలో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది. దీంతో ఆ మార్గంలో రైళ్లు ముందుకు కదల్లేదు. అసెంబ్లీ-అమీర్‌పేట మార్గంలో మెట్రో సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో 30 నిమిషాలపాటు అధికారులు మెట్రో సేవలను నిలిపివేశారు. ఈ క్రమంలోనే అమీర్‌పేట్ వైపు వెళ్లే మెట్రో రైలును అసెంబ్లీ స్టేషన్ దగ్గర నిలిపివేశారు. ఉద్యోగులు, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మెట్రో సేవలు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోవడంపై ప్రయాణికులు మెట్రో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.