నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్

నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా..  పోలీసులు సీజ్

ఘట్ కేసర్, వెలుగు: బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని వెళ్తుండగా పట్టుకుని సీజ్ చేశారని ఓ మహిళ రాచకొండ సీపీకి కంప్లయింట్ చేసింది. అన్నోజిగూడకు చెందిన మహిళ అండాలు గురువారం మధ్యాహ్నం ఘట్ కేసర్ లో తన నగలను తాకట్టుపెట్టి అప్పు పైసలు చెల్లించగా.. మిగతా రూ.3.99 లక్షల నగదు తీసుకుని వెళ్తుంది. ఘట్ కేసర్ ఎస్ఐ శ్రీకాంత్ ఆమెను ఆపి డబ్బులు సీజ్ చేశాడు. 

నగలు తాకట్టు పెట్టిన రసీదులు చూపినా పట్టించుకో కుండా పోలీసులు డబ్బులు సీజ్ చేసినట్లు బాధిత మహిళ ఆరోపించింది. డబ్బులు పట్టుకుని సీజ్ చేయటంతో తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. లోక్ సభ ఎన్నికల రూల్ పేరుతో  సామాన్యులను ఇబ్బందులకు గురి చేయకుండా చర్యలు తీసుకోవాలని సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆమె కోరింది.