
రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ గేట్ ముందు అసిస్టెంట్ వార్డెన్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇంటర్వ్యూ వాయిదా వేశారని ఆరోపిస్తూ శుక్రవారం (జూన్ 20) ధర్నా చేపట్టారు. దీంతో యూనివర్సిటీ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్టళ్లకు సంబంధించి అసిస్టెంట్ వార్డెన్ పోస్టుల కోసం ఇంటర్వ్యూ నోటిఫికేషన్ విడుదల చేసింది యూనివర్సిటీ. మహిళలకు 10 , పురుషులకు 10 అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు వర్సిటీ అధికారులు. షెడ్యూల్ ప్రకారం జూన్ 20 ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు యూనివర్సిటీకి చేరుకున్నారు.
అయితే ఈరోజు (జూన్ 20) జరగాల్సిన ఇంటర్వ్యూ లు సడెన్ గా క్యాన్సల్ చేయడంతో ఆందోళన బాట పట్టారు అభ్యర్తులు. నోటిఫికేషన్ ప్రకారం ఇంటర్వ్యూ లు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేయడం ఏంటని ప్రశ్నించారు. దాదాపు రెండు గంటలు అభ్యర్థుల ఆందోళన కొనసాగుతోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు యూనివర్సిటీ వద్దకు చేరుకుని పరిస్థితిన అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.