షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ జరుగుతుంది: గంగూలీ

షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ జరుగుతుంది: గంగూలీ

కరోనా వైరస్ ఎఫెక్ట్ తో IPL పదమూడో సీజన్ నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 29న ప్రారంభమయ్యే మెగా లీగ్ అనుకున్న సమయానికే జరుగుతుందా లేక వాయిదా పడుతుందా అనే ఊహాగానాలు వస్తున్నాయి. అయితే.. వాటన్నింటికీ సమాధానం చెప్పారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.

షెడ్యూల్ ప్రకారమే లీగ్ షురూ అవుతుందని స్పష్టం చేశాడు గంగూలీ. ఈ విషయంలో ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు ఆటగాళ్లు, స్టేడియాలకు వచ్చే ప్రేక్షకులు కరోనా వైరస్ కు గురి కాకుండా ఉండేందుకు తగిన విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపాడు దాదా. ఇందుకోసం బీసీసీఐ మెడికల్ టీమ్ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించిందన్నాడు.