మోదీతో రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు సూర్యవంశీ..

మోదీతో రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు సూర్యవంశీ..

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌–18లో రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ రాయల్స్‌‌‌‌‌‌‌‌ తరఫున సూపర్ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చూపెట్టిన 14 ఏళ్ల వైభవ్‌‌‌‌‌‌‌‌ సూర్యవంశీ తన తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం పాట్నా విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశాడు. తన కాళ్లకు నమస్కరించిన వైభవ్‌‌‌‌‌‌‌‌ను ఆప్యాయంగా పలకరించిన మోదీ క్రికెట్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి విషయాలను అడిగి తెలుసుకున్నారు. ‘వైభవ్‌‌‌‌‌‌‌‌ భవిష్యత్‌‌‌‌‌‌‌‌ ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని కోరుకుంటున్నా. అతడు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నా. నా ఆశీస్సులు అతనికి ఎల్లప్పుడు ఉంటాయి’ అని మోదీ ట్వీట్ చేశారు.