న్యూఢిల్లీ: ఇరాన్ రాజధాని టెహ్రాన్లో పేలుడు సంభవించింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో పలు నలుగురు పౌరులు గాయపడ్డారు. పేలుడు వల్ల టెహ్రాన్లోని పబ్లిషర్స్, బుక్షాప్స్కు నష్టం వాటిల్లిందని స్థానిక మీడియా శనివారం తెలిపింది. టెహ్రాన్ యూనివర్సిటీకి సమీపంలో ఉన్న నాలుగంతస్థుల భవనంలో ఈ పేలుడు సంభవించింది. దానికి అతి దగ్గరలో పేపర్, బుక్స్ స్టోర్స్ ఉండటంతో అగ్ని ఆ స్టోర్స్కు అంటుకుంది. ఫైర్మెన్ ముగ్గురు పురుషులతోపాటు ఓ మహిలను కాపాడారు. వారిని బ్లేజ్లోని ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనకు కారణాలపై అధికారులు విచారణ చేస్తున్నారు.
టెహ్రాన్లో గత నెలలో ఒక మెడికల్ క్లినిక్లో పేలుడు సంభవించింది. ఆ ఘటనలో 19 మంది పౌరులు చనిపోయారు. అది గ్యాస్ లీకేజీ వల్ల జరిగిందని అధికారులు తెలిపారు. అదే నెలలో 26వ తేదీన మిలటరీ వెపన్స్ డెవలప్మెంట్ బేస్లో మరో పేలుడు జరిగింది. ఇలా ఈ మధ్య టెహ్రాన్లో పలు మార్లు పేలుడు జరగడం గమనార్హం.