వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య టెన్షన్లు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఇరు దేశాల మధ్యాయుద్ధ వాతావరణం కనిపిస్తోంటే .. మరోవైపు యురేనియం నిల్వలు, వాటి శుద్ధి స్థాయిని పెంచినట్టు ఇరాన్ ప్రకటించింది. దీనికి సంబంధించిన అంతర్జా తీయ ఒప్పందం నుంచి బయటకు వచ్చేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ పరిణామాలు అమెరికాకు వ్యతిరేకంగా ఓ న్యూక్లి యర్ బాంబును ఇరాన్ తయారు చేస్తోందని లేదా మిలిటరీ ఎటాక్ ను ప్రారంభించనుందనే వాదనకు బలం చేకూ రుస్తున్నాయి. ఇరాక్ నుంచి యూఎస్ బలగాలు వెనక్కి వెళ్లాలన్న ఆ దేశ పా ర్లమెంట్ నిర్ణయంపై ట్రంప్ మండిపడ్డారు. అదే పరిస్థితి వస్తే ఇరాక్ పై అతి భారీ ఆంక్షలు విధించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఆంక్షలు తప్పవు: ట్రంప్
ఇరాక్ పై అతి భారీ ఆంక్షలు విధిస్తామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. బాగ్దాద్లో డ్రోన్ ఎటాక్తో ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చడంతో యూఎస్ మిలీటరీ తమ దేశాన్ని విడిచివెళ్లాలంటూ ఇరాక్ పార్లమెంట్ తీర్మానం చేయడంపై ట్రంప్ మండిపడ్డారు. ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టు గ్రూపుకు వ్యతిరేకంగా పోరాటం కోసం దాదాపు 5 వేల మంది అమెరికా సోల్జర్స్ ఇరాక్ సేనలకు సహాయంగా ఆ దేశంలో ఉన్నారు. ‘‘ఇరాక్లో మేము చాలా ఖర్చు చేశాం. బిలియన్ల డాలర్లు ఖర్చుపెట్టి ఎయిర్ బేస్ను నిర్మించాం. మేము ఖర్చు చేసిన మొత్తం తిరిగి చెల్లించే వరకు ఇరాక్ను విడిచిపెట్టేది లేదు”అని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఇరాక్లో నిర్మించిన ఎయిర్ బేస్ పేరును మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. ‘‘ఒకవేళ మమ్మల్ని బలవంతంగా పంపించాలని చూస్తే అది స్నేహపూర్వక వాతావరణంలో జరగదు. గతంలో లేనటువంటి అతి భారీ ఆంక్షలు విధి స్తాం. ప్రస్తుతం ఇరాన్పై ఉన్న ఆంక్షలను మించి ఉంటాయి”అని హెచ్చరించారు. ‘‘ఇరాక్కు సంబంధించి తీసుకున్న నిర్ణయం చాలా తప్పు. మిడిల్ఈస్ట్కు వెళ్లడం దేశ చరిత్రలో తీసుకున్న అతి పెద్ద తప్పు. ఈ విషయాన్ని నేను పబ్లిక్గానే చెపుతున్నా”అని ట్రంప్ అన్నారు.
న్యూక్లియర్ డీల్ నుంచి ఇరాన్ ఔట్
తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో యురేనియం శుద్ధిలో కీలక పాత్ర పోషించే సెంట్రిఫ్యూజ్ల సంఖ్యపై ఉన్న పరిమితిని పక్కన పెడుతున్నట్లు ఇరాన్ ప్రకటించింది. యురేనియం నిల్వలు, వాటి శుద్ధి స్థాయిని పెంచుకున్నామని, తమ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పై ఎలాంటి పరిమితులు లేవని ప్రకటించింది. ఈ నిర్ణయంతో 2015 నాటి అణు ఒప్పందం నుంచి పూర్తిగా బయట పడింది. ప్రస్తుతానికి విద్యుత్ ఉత్పత్తి వంటి దేశ అవసరాల కోసమే అణు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపింది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ)కి తమ సహకారం కొనసాగుతుందని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ నిర్ణయంపై ఈ డీల్లో భాగస్వామ్య దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, చైనా, బ్రిటన్ విచారం వ్యక్తం చేశాయి. ఇరాన్ తీసుకున్న నిర్ణయంపై ఆ దేశ ఫారిన్ మినిస్టర్తో చర్చిస్తామని యునైటెడ్ నేషన్స్ తెలిపింది. మరోవైపు ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ గ్రూపు మళ్లీ యాక్టివ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తంగా మిడిల్ఈస్ట్ ను ప్రమాదకరంగా, అస్థిర ప్రాంతంగా మార్చే సూచనలు ఉన్నాయి.