బాగ్దాద్ మొహర్రం ఊరేగింపులో అపశృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని కర్బాలాలో మొహర్రం ఊరేగింపులో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. తొక్కిసలాటలో 31 మంది చనిపోయారు. 100 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు చెప్పారు. కర్బాలాలో జరిగే ఈ ఊరేగింపులో ఏటా వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈ ఏడాదీ అధిక సంఖ్యలో భక్తులు వచ్చారని, ఊరేగింపు జరుగుతుండగా తొక్కిసలాట జరిగిందని అధికారులు చెప్పారు.

