సెల్ఫ్​ క్వారంటైన్‌లో సెంట్రల్ మినిస్టర్ రవి శంకర్ ప్రసాద్

సెల్ఫ్​ క్వారంటైన్‌లో సెంట్రల్ మినిస్టర్ రవి శంకర్ ప్రసాద్

న్యూఢిల్లీ: కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన సంగతి తెలిసిందే. షాను శనివారం కలసిన నేపథ్యంలో రవి శంకర్ జాగ్రత్తగా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రవి శంకర్ ప్రసాద్‌కు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని, ప్రోటోకాల్‌లో భాగంగానే ఆయన క్వారంటైన్‌లో ఉంటున్నారని సమాచారం. తనకు కరోనా పాజిటివ్‌గా తేలిందని ఆదివారం హోం మంత్రి అమిత్​ షా ప్రకటించారు.