ఖర్చు చేసిన నిధులపై మంత్రి ఒక మాట.. ఎమ్మెల్యే మరో మాట

ఖర్చు చేసిన నిధులపై మంత్రి ఒక మాట.. ఎమ్మెల్యే మరో మాట

వేములవాడలో జరిగిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఐతే వేములవాడ ఆలయ అభివృద్ధికి ఖర్చు చేసిన నిధులపై మంత్రి ఓ మాట, ఎమ్మెల్యే ఓ మాట చెప్పడం అయోమయానికి దారి తీసింది. రాజన్న ఆలయ అభివృద్ధికి వంద కోట్లు ఖర్చు చేశామని, మరో 50 కోట్లు బడ్జెట్ లో పెట్టామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. అందుబాటులో కార్మికులు లేరని మంత్రి  చెప్పబోతుండగా..ఎమ్మెల్యే చెన్నమనేని అడ్డుతగిలారు. ఆలయ సమగ్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. VTDA, ఇతర సంస్థల ద్వారా 230 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. దేవాలయం, పట్టణం కవల పిల్లల్లాంటివని, దేవాలయం అభివృద్ధి చెందాలంటే పట్టణం అభివృద్ధి చేయాలని చెప్పారు.