అగ్నిపథ్‌‌ కాదు.. ఆవారా పథ్‌‌

అగ్నిపథ్‌‌ కాదు.. ఆవారా పథ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: దేశవ్యాప్తంగా యువత ను రోడ్లపైకి తెచ్చిన అగ్నిపథ్‌‌ పథకాన్ని కేంద్రం వెంటనే వాపస్ ​తీస్కోవాలని టీఆర్ఎస్‌‌ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కాలేరు వెంకటేశ్‌‌ డిమాండ్‌‌ చేశారు. అది అగ్నిపథ్‌‌ కాదు.. ఆవారా పథ్‌‌ అని విమర్శించారు. ఎమ్మెల్యేలు శుక్రవారం టీఆర్ఎస్ ఎల్పీలో మీడియాతో మాట్లాడారు. రక్షణ శాఖ ప్రైవేటీకరణలో భాగమే ఈ అగ్నిపథ్‌‌ పథకమని మండిపడ్డారు. ‘‘ప్రధాని మోడీ విధానాలతో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దెబ్బతింటోంది. దేశంలో తిరుగుబాటు మొదలైంది. బండి సంజయ్‌‌ అజ్ఞానంతో ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌‌ చదువుతున్నారు” అని అన్నారు.