జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

జమ్మూ  కాశ్మీర్‌లో ఉగ్రవాదిని హతమార్చారు.  శ్రీనగర్‌లోని హజ్రత్‌బాల్ ప్రాంతంలో ఒక ఉగ్రవాదిని పోలీసులు మట్టుపెట్టారు. అయితే ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం నుండి పారిపోయిన మరో ఇద్దరి కోసం అన్వేషణ కొనసాగుతోందని తెలిపారు అధికారులు. హజ్రత్‌బాల్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని తెలిపారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి పారిపోయిన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.హతమైన ఉగ్రవాదిని మంజూర్‌గా గుర్తించారు. అతను పాకిస్థానీ జాతీయుడని.. నిషేధిత ఉగ్రవాద సంస్థ LeT/TRFకి చెందిన వాడిగా గుర్తించారు. LeT/TRF కమాండర్ మెహ్రాన్ యొక్క సహచరుడని అధికారులు తెలిపారు.   టెర్రరిస్ట్‌ను హత్య చేయడం పెద్ద విజయమన్నారు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్.