గణపురం SI ఉదయ్ కిరణ్ సస్పెండ్

గణపురం SI ఉదయ్ కిరణ్ సస్పెండ్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం SI ఉదయ్ కిరణ్ సస్పెండ్ అయ్యారు. గణపురం మండల కేంద్రంలోని ఓ బైక్ షోరూం దగ్గర NOC విషయంలో ఈ నెల 11 న యజమానికి, కస్టమర్ లకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో యజమాని పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు ప్రశాంత్, శ్రావణ్ అనే ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. ప్రశాంత్ అనే వ్యక్తిని SI ఉదయ్ కిరణ్ అకారణంగా చితకొట్టాడనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో మనస్థాపంతో పోలీస్ స్టేషన్ ముందే ఈ నెల 12న పురుగుల మందు తాగాడు ప్రశాంత్. నిన్న హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ప్రశాంత్ చనిపోయాడు. దీంతో ఇవాళ SI ఉదయ్ కిరణ్ ను సస్పెండ్ చేస్తూ నార్త్ జోన్ అడిషనల్ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. 

మరిన్ని వార్తల కోసం..

ఆసియా రెజ్లింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియన్‌‌ రెజ్లర్ల పట్టు

25 గెటప్స్ లో కనిపించనున్న విక్రమ్