
లండన్: బొటన వేలి గాయంతో ఇబ్బందిపడుతున్న ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ఈ మేరకు ప్రాక్టీస్ కోసం ససెక్స్ తరఫున కౌంటీ మ్యాచ్ ఆడనున్నాడు. ఇందులో రాణిస్తే ఎడ్జ్బాస్టన్లో జులై 2 నుంచి ఇండియాతో జరిగే రెండో టెస్ట్లో బరిలోకి దిగే చాన్స్ ఉంది. టాప్ పేసర్లు ఆర్చర్, మార్క్ వుడ్ లేని లోటు ఇంగ్లిష్ బౌలింగ్లో స్పష్టంగా కనిపిస్తోంది. ‘ససెక్స్ తరఫున ఆర్చర్ రెడ్బాల్ క్రికెట్ మొదలుపెట్టనున్నాడు. తుది జట్టులో చోటు దక్కకపోయినా అతను ప్రాక్టీస్లో పాల్గొంటాడు. అందుకోసమే ససెక్స్ జట్టుతో పాటే ట్రావెల్ చేస్తున్నాడు’ అని ఈసీబీ వెల్లడించింది.
ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్చర్.. గాయాల కారణంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్కు దూరమై నాలుగేళ్లు అవుతోంది. మోచేతి, వెన్ను నొప్పి పదే పదే రావడంతో ఆర్చర్ 2021 నుంచి ఇంగ్లండ్ తరఫున వైట్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడాడు. ఇటీవల ఇంగ్లండ్ లయన్స్ తరఫున రెడ్ బాల్ క్రికెట్ ఆడాల్సి ఉన్నా.. బొటన వేలి గాయం తగ్గకపోవడంతో బరిలోకి దిగలేదు.