MI vs PBKS: అయ్యర్ ఓకే.. కానీ అతడే అసలైన హీరో: ముంబై కాన్ఫిడెంట్‌ను రెండు సార్లు దెబ్బ కొట్టాడుగా

MI vs PBKS: అయ్యర్ ఓకే.. కానీ అతడే అసలైన హీరో: ముంబై కాన్ఫిడెంట్‌ను రెండు సార్లు దెబ్బ కొట్టాడుగా

ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడం అంత సింపుల్ కాదు. వరల్డ్ క్లాస్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ లతో పాటు మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్ లాంటి బౌలింగ్ లైనప్ ముంబై సొంతం. ఆ జట్టుపై ఆడాలంటే ఎవరికైనా కొంచెం కష్టమే. పంజాబ్ క్వాలిఫయర్ 1 ఆడినా.. క్వాలిఫయర్ 2 లో ముంబైపై గెలిచి ఫైనల్ కు వెళ్లినా అంతా ఆస్ట్రేలియా బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ కే క్రెడిట్ దక్కాలి. ఐపీఎల్ లీగ్ దశలో ఆఖరి లీగ్ మ్యాచ్ లో పంజాబ్ ముంబైపై గెలిచి క్వాలిఫయర్ 1 కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లిస్ ఆడిన ఆట అద్భుతం. హాఫ్ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. తీవ్ర ఒత్తిడిలో 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 73 పరుగులు చేసి ముంబైకి షాక్ ఇచ్చాడు. 

ఇక ఆదివారం ముంబైపై (జూన్ 1) జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్ లోనూ ఇంగ్లిస్ అదరగొట్టాడు. చేసింది 38 పరుగులే అయినా మ్యాచ్ గెలిచేందుకు ఈ ఇన్నింగ్స్ ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్ లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి దూకుడు ప్రదర్శించడం ఇన్నింగ్స్ కే హైలెట్ గా మారింది. ఇంగ్లిస్ ఇచ్చిన ఆరంభం పంజాబ్ కు కాన్ఫిడెంట్ పెంచింది. లీగ్ దశలో ఒకసారి.. క్వాలిఫయర్ 2 లో మరోసారి ఇలా రెండు సార్లు ముంబై జట్టు పరాజయానికి కారణమయ్యాడు. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఇంగ్లీస్ కు పంజాబ్ జట్టులో ఛాన్స్ ఇవ్వగానే విమర్శలు వచ్చాయి. 

►ALSO READ | ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. వన్డేలకు గుడ్ బై చెప్పిన స్టార్ క్రికెటర్

సొంత దేశం కాబట్టి అవకాశాలు ఇస్తున్నాడని ఆరోపించారు. అయితే ఈ ఆసీస్ బ్యాటర్ మాత్రం తనకు వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకున్నాడు. ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ పై ఎలాంటి ప్రదర్శన ఇస్తాడో ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆదివారం జరిగిన క్వాలిఫయర్‌‌‌‌–2లో పంజాబ్‌‌‌‌ 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌‌‌‌కు చెక్‌‌‌‌ పెట్టింది. టాస్‌‌‌‌ ఓడిన ముంబై 20 ఓవర్లలో 203/6 స్కోరు చేసింది. తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన పంజాబ్‌‌‌‌ 19 ఓవర్లలో 207/5 స్కోరు చేసి గెలిచింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్‌‌‌‌ అయ్యర్ కు  ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.