ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. వన్డేలకు గుడ్ బై చెప్పిన స్టార్ క్రికెటర్

ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. వన్డేలకు గుడ్ బై చెప్పిన స్టార్ క్రికెటర్

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మాక్స్ వెల్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే టీ 20లకు అందుబాటులో ఉంటున్నట్లు ప్రకటించాడు.  2012 నుంచి 2025 వరకు తన కెరీర్ లో 149 వన్డేలు ఆడి 3990 పరుగులు చేసి 77 వికెట్లు పడగొట్టాడు. 2015 మరియు 2023లో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలిచిన జట్లలో కూడా అతను ఒకడు. వన్డేల్లో 4 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో చివరి వన్డే  మ్యాచ్ ఆడిండు.  టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. 

ఆటకు తన శరీరం పరిస్థితులకు తగ్గట్టు సహకరిస్తుందా లేదా అనేది చూసుకున్నా..అయితే నేను జట్టును కొంచెం నిరాశపరుస్తున్నట్లు  అనిపించింది. (సెలెక్టర్ల ఛైర్మన్) జార్జ్ బెయిలీతో  మాట్లాడి అతడితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నా అని ఓ  పాడ్‌కాస్ట్‌తో అన్నాడు మాక్స్ వెల్ .

2023 క్రికెట్ ప్రపంచ కప్‌లో ముంబైలో జరిగిన గ్రూప్ దశలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో మాక్స్‌వెల్ అదిరిపోయే  ప్రదర్శన చేశాడు. 293 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన  ఆస్ట్రేలియా 91/7  వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండగా.. అపుడు బ్యాటింగ్ కు వచ్చిన మాక్స్ వెల్  శరీరం సహకరించకున్నా 128 బంతుల్లో 201 నాటౌట్ తో  తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.