అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం తర్వాత భారీగా పెరిగిన బంగారం రేట్లు ఇవాళ కొంత చల్లబడ్డాయి. ఇదే క్రమంలో వెండి రేట్లలో కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీగా మారింది. తగ్గిన ధరల్లో ఆభరణాలు షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లో మారిన రేట్లను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం బెటర్.
జూన్ 16న బంగారం రేట్లు తగ్గాయి. జూన్ 15 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.16 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 137గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 875గా కొనసాగుతోంది.
మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూన్ 16, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.5వేలు తగ్గి రూ.2లక్షల 75వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.275 దగ్గర ఉంది.
