నల్లగొండ జిల్లా జైలుకు జర్నలిస్ట్ రఘు

నల్లగొండ జిల్లా జైలుకు జర్నలిస్ట్ రఘు

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సబ్ జైల్లో ఉన్న జర్నలిస్ట్ రఘును నల్లగొండ జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. జ‌న‌వ‌రి 12, 2021లో ర‌ఘు మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి,ఎమ్మెల్యే సైదిరెడ్డిపై.. పరువుప్రతిష్టలు భంగం కలిగే విధంగా చచ్చిపో, పేదల రక్తం తాగండి అంటూ చేసిన వ్యాఖ్యలు, వార్తలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రవీందర్ నాయక్ అనే TRS కార్యకర్త జర్నలిస్ట్ రఘు, రాజ్ న్యూస్ పై ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై అప్పట్లో కేసు పెట్టారు పెట్టారు పోలీసులు. 

ఆ కేసును ఇప్పుడు తిర‌గ‌దోడి.. చ‌ర్య‌లు చేపడుతున్నారు. జ‌ర్న‌లిస్టు ర‌ఘుపై కేసులో మ‌ఠంప‌ల్లి పోలీసులు పీటీ వారెంట్ పొందారు. దీంతో ర‌ఘును హుజుర్ న‌గ‌ర్ సబ్ జైలు నుండి న‌ల్గొండ జిల్లా జైలుకు మార్చారు.