వెంటనే జర్నలిస్టులను విడుదల చేయాలి

వెంటనే జర్నలిస్టులను విడుదల చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను నిర్భందం చేసి నిరంకుశ పాలనను చేస్తుందన్నారు TJS అధ్యక్షుడు కోదండరాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారంటూ యూట్యూబ్  జర్నలిస్టులను అరెస్టులు చేశారన్నారు. మఫ్టీలో వెళ్లి వారిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఏకకాలంలో  ఇంతమంది జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. సోషల్ మీడియాని కంట్రోల్ చేయలేక ప్రభుత్వం వారిపై దాడి చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి చేస్తుందని... నిరంకుశ పాలనకు ఇదే నిదర్శనమన్నారు. ప్రభుత్వం పోలీసులను బౌన్సర్లుగా ఉపయోగించుకుంటుందన్నారు. వెంటనే జర్నలిస్టులను విడుదల చేయాలి కోదండరాం డిమాండ్ చేశారు. .