చెట్టెక్కిన మంత్రి జూపల్లి

చెట్టెక్కిన మంత్రి జూపల్లి

పార్లమెంట్‌‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా కొల్లాపూర్‌‌ మండలం అంకిరావుపల్లి, కుడికిళ్ల, ముక్కిడిగూడెం, నార్లాపూర్, ఎల్లూరు గ్రామాల్లో పర్యటించారు. బోడబండతండాలో ఓ మామిడి చెట్టు కింద కార్యకర్తల సమావేశం నిర్వహించడంతో ఆయన చెట్టు మీదకు ఎక్కి కార్యకర్తలతో మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందని, మల్లు రవిని గెలిపించుకుంటే నాగర్‌‌కర్నూల్‌‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు.