
తన ఇంట్లో అక్రమంగా నగదు కలిగి వున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ కేసులో ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ గురువారం (జూన్19) నివేదిక సమర్పించింది. తగిన ఆధారాలు ఉన్నందున జస్టిస్ వర్మపై తొలగింపు చర్యలను ప్రారంభించాలని ప్యానెల్ సిఫార్సు చేసింది.
జస్టిస్ వర్మ బదిలీకి ముందు ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయన ఇంటిలో పెద్ద మొత్తంలో నగదు దొరికింది. జస్టిస్ వర్మ ఇంట్లోని స్టోర్ రూం అగ్ని ప్రమాదంలో భారీ ఎత్తున నోట్లకట్టలు బయటపడటంతో వివాదం నెలకొంది. ఈ సంఘటన తరువాత సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది. జస్టిస్ వర్మ అక్రమ నగదు నిల్వలపై దర్యాప్తుకు ముగ్గురు న్యాయమూర్తులతో త్రిసభ్య ప్యానెల్ నియమించింది.
2025 మార్చిలో ప్రస్తుత అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ వర్మ కు చెందిన ఢిల్లీలోని అధికారిక నివాసంలో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన దర్యాప్తులో సగం కాలిపోయిన నోట్లతో సహా పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జస్టిస్ వర్మను తొలగించాలని డిమాండ్ చేయడానికి తగిన ఆధారాలు ఉన్నాయని ప్యానెల్ పేర్కొంది.
ఢిల్లీలోని 30 తుగ్లక్ క్రెసెంట్ ప్రాంగణంలోని స్టోర్రూమ్లో దొరికిన డబ్బు ఈ కమిటీ దగ్గర ఉంది. జస్టిస్ వర్మ లెక్కలు లేని నగదు కలిగి ఉన్నారని ప్యానెల్ రిపోర్టు ఇచ్చింది.
►ALSO READ | సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై కేసు నమోదు
స్టోర్ రూమ్ లోకి అనుమతి లేకుండా బయటి వ్యక్తులు ఎవరూ ప్రవేశించకుండా భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని.. ప్రవేశం కేవలం జస్టిస్ వర్మ ,ఆయన కుటుంబ సభ్యులకే ఉంది అని ప్యానెల్ తెలిపింది.
నగదు స్వాధీనం చేసుకున్నప్పుడు జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. తరువాత జస్టిస్ వర్మను అతని మాతృ సంస్థ అలహాబాద్ హైకోర్టు పంపించారు.
అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా రాజ్యాంగ, కార్మిక ,పారిశ్రామిక చట్టాలు, కార్పొరేట్ చట్టాలు, పన్నులు ,అనుబంధ చట్ట శాఖలకు సంబంధించిన అనేక కేసులను పరిస్కరించారని ఢిల్లీ హైకోర్టు అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది.
జస్టిస్ వర్మ అక్టోబర్ 13, 2014న అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఫిబ్రవరి 1, 2016న ఆ కోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ వర్మ అక్టోబర్ 11, 2021నుంచిఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ వివాదం తర్వాత హైకోర్టు కు బదిలీ అయ్యారు.
జస్టిస్ వర్మ అక్టోబర్ 13, 2014న అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఫిబ్రవరి 1, 2016న ఆ కోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ వర్మ అక్టోబర్ 11, 2021నుంచిఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ వివాదం తర్వాత హైకోర్టు కు బదిలీ అయ్యారు.