సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై కేసు నమోదు

సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై కేసు నమోదు

గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు, అతని అనుచరుడు వెంకటేష్ తో పాటు మరో ముగ్గురిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కుషిచంద్ వడ్డే అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు 115(2), 126(2), 324(5), 125 R/W 3(5) BNS యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

బాధితుడు కుషిచంద్ వడ్డే తెలిపిన వివరాల ప్రకారం జూన్ 18న ఎఫ్‌సీఐ కాలనీలో రోడ్డు మార్కింగ్ పనులు జరుగుతుండగా, శ్రీధర్ రావు అనుచరుడు వెంకటేష్ హైడ్రా పోలీసుల సమక్షంలో అత్యంత వేగంగా కారు నడిపి తనను ఢీకొట్టబోయాడు. అనంతరం తిరిగి వెళ్తుండగా KTM బైక్ (TS 36 1085) పై వచ్చిన దుండగులు తన కారుపై రాళ్ల దాడి చేశారని వడ్డే ఫిర్యాదులో తెలిపారు. ఈ దాడి సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు, వెంకటేష్ ఆదేశాల మేరకే జరిగిందన్నారు. శ్రీధర్ రావు నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు తన ఫిర్యాదులో  తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 రెండు రోజుల క్రితం

ఇదే సంధ్యకన్వెన్షన్ యజమాన్యంపై రెండు రోజుల క్రితంFCI  ప్లాట్ యాజమాని సినీ నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంత్‌ పై  సంధ్య కన్వెన్షన్ యండి శ్రీధర్ బాబు సిబ్బందికి దాడికి పాల్పడ్డారని  గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు .  GHMC హైడ్రా అధికారులు FCI లైఅవుట్ లో రోడ్ మ్యాపింగ్ చేస్తుండగా వీడియో తీస్తుండగా తమపై దాడి చేశారని ఫిర్యాదులో తెలిపారు.