
బషీర్ బాగ్, వెలుగు: కులాలకు అతీతంగా దేశం లో జాతీయవాదం బలపడుతున్నదని రాజ్యస భ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్య క్షుడు కె. లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. కులాల సంఘర్షణ లేకుండా.. సమన్వయ దృక్పథంతో బతికినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. శివాజీ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం డాక్టర్ పి. భాస్కర్ యోగి రచించిన ‘ సమత్వ సాధనలో సౌజన్య మూర్తులు’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.
మేధావులుంటే వామపక్ష భావజాలం ఉన్నవాళ్లే అనే భ్రమ నుంచి మెల్లి మెల్లిగా దేశం బయటపడుతుందని పేర్కొన్నారు. మహనీయుల జీవితాలను పరిచయం చేసిన డాక్టర్ భాస్కర్ యోగి అభినందనీయులన్నారు. కార్యక్రమంలో సామాజిక సమసత కన్వీనర్ అప్పాల ప్రసాద్, నేషనలిస్ట్ హబ్ సాయి , ఆలే భాస్కర్, మురళి మనోహర్, జర్నలిస్టు రానా, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.