వారం రోజులపాటు కాకతీయ ఉత్సవాలు

వారం రోజులపాటు కాకతీయ ఉత్సవాలు

కాకతీయుల కళా వైభవాన్ని ప్రపంచానికి తెలిపేందుకు కేసిఆర్ సంకల్పించినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాకతీయుల ఉత్సవాల షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తామన్న ఆయన ఉత్సవాలకు కాకతీయ వారసులను అధికారికంగా ఆహ్వానిస్తామన్నారు. వారోత్సవాల నిర్వాహణ ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జూలై 7నుంచి ఏడు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. పర్యాటకులకు మరింత సౌకర్యం కోసమే హరిత హోటల్స్ ను ప్రైవేట్ వాళ్లకు ఇచ్చామన్నారు. ఇక హైదరాబాద్ తరువాత తెలంగాణలో అతి పెద్ద నగరంగా వరంగల్ ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అనేక పరిశ్రమలను వరంగల్ కు తెచ్చేందుకు కేటీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. 

వారం పాటు కాకతీయ ఉత్సవాలు

ఘనమైన చరిత్ర కలిగిన నగరం వరంగల్ అని చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. గొలుసుకట్టు చెరువులలో సాగు, తాగు నీటి సమస్య లేకుండా నిర్మాణాలు చేపట్టిన ఘనత కాకతీయులకే దక్కిందన్నారు. వారం పాటు కాకతీయ ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. కాకతీయ వంశానికి చెందిన 22వరాజు అయిన కమల్ చంద వాసుదేవ్ ను కాకతీయ ను ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా కాకతీయ కాలం నాటి సంప్రదాయాలు, పద్ధతులను కళ్లకు కట్టినట్లు చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.