‘అహింస’ లిరికల్ సాంగ్ విడుదల

‘అహింస’ లిరికల్ సాంగ్ విడుదల

టాలీవుడ్ లో ‘తేజ’ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. చిత్రం, నువ్వు నేను, నిజం లాంటి మూవీస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన తేజ.. ఇప్పుడు ‘అహింస’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమవుతున్నారు. గీతికా తివారీ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవలే సినిమాకు సంబంధించి టీజర్, సాంగ్ రిలీజ్ అయ్యాయి. తాజాగా ఓ లిరికల్ సాంగ్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ‘పట్టు సేనుల్లో దూదిని ఏరి.. దూదిని మొత్తం బుట్టలో కూరి.. బుట్ట దూది రత్నం వడికి.. తెల్లతెల్లని నూలును తీసి.. నూలంతా నేతన్నకు ఇచ్చి.. నేతగాడు ఓ కోకను నేసి కోటి పువ్వుల రంగులు తీసి... కోకపైన సింగారిస్తే’ అంటూ సాంగ్ సాగుతుంది.

ఈ పాటను పూర్తిగా పల్లె వాతావరణంలో చిత్రీకరించారు. చంద్రబోస్ రచించగా కళా భైరవ, కీర్తన శ్రీనివాస్ లు ఆలపించారు.  శంకర్ కొరియోగ్రఫి, ఆర్పీ పట్నాయక్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ  త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. యువతరాన్ని ఆకట్టుకొనే అన్ని అంశాలు ఇందులో ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు.