
బెంగళూరు: కర్నాటకలో ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. తుమకూరు జిల్లాలోని కడశెట్టిహళ్లీలో ఈ నెల 24న ఈ ఘటన జరిగింది. మృతుడిని శంకరమూర్తిగా గుర్తించారు. తిప్తూర్లోని కల్పతరు బాలికల హాస్టల్లో కుక్గా పనిచేసే సుమంగళకు, కరదలుసంటే గ్రామానికి చెందిన నాగరాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అడ్డుగా ఉన్న భర్త శంకరమూర్తిని చంపడానికి ఇద్దరు కుట్ర పన్నారు.
24న రాత్రి సుమంగళ.. శంకరమూర్తి కండ్లలో కారం పొడి చల్లి, మెడపై కాలుతో నొక్కి చంపినట్టు పోలీసులు తెలిపారు. గోనె సంచిలో డెడ్బాడీని 30 కి.మీ దూరంలోని ఒక పొలంలోని బావిలో పారేశారు. నోనవినకెరే పోలీస్ స్టేషన్ లో మొదట శంకరమూర్తి మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది. అయితే, పోలీసుల దర్యాప్తులో మృతుడి మంచంపై కారం పొడి ఆనవాళ్లు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో సుమంగళను విచారించగా ఆమె ఫోన్ కాల్ డేటాను చెక్ చేయడంతో హత్యవెలుగులోకి వచ్చింది. చివరకు ఆమె