కేసీఆర్ నిరుపేదలను మోసం చేసిండు.. 10 ఏండ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే : గడ్డం వంశీ కృష్ణ

కేసీఆర్ నిరుపేదలను మోసం చేసిండు.. 10 ఏండ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే : గడ్డం వంశీ కృష్ణ

మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తానని చెప్పి నిరుపేదలను మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం వస్తే బాగుపడుతుంది అనుకుంటే డిగ్రీలు బీటెక్ లు చదువుకున్న వారు ఆటో నడుపుతూ కూలి పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో అక్రమ కేసులు, భూ దందా, ఇసుక దందాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

10 ఏండ్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని గడ్డం వంశీ విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ  గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు గడ్డం వంశీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నేత దుద్దిల్ల శ్రీపాదారావు చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఆయన చేసిన స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాక వెంకటస్వామి అని గుర్తు చేశారు.

 కాంగ్రెస్ ప్రభుత్వ హయం లో ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని రైతులకు మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రేషన్ కార్డులు ఇచ్చామని ఇముందు కూడా ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ సంస్థలు, ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి ఇక్కడి ప్రాంత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని తెలిపారు.  మీ చిన్న కొడుకులా భావించి తనను ఆశీర్వదించి గెలిపించండని గడ్డం వంశీ కృష్ణ కోరారు.