కరోనా నియంత్రణలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారు

కరోనా నియంత్రణలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారు

కరోనా నియంత్రణలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారన్నారు ఆలేరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ బీర్ల అయిలయ్య. ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి.. ధనార్జనే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని విమర్శించారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. 15 రోజులు లాక్ డౌన్ విధించాలని కోరుతూ.. మున్సిపల్ కమిషనర్ రజిత, యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డికి కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి వినతి పత్రం అందజేశారు. వ్యాపారులంతా లాక్ డౌన్ కి సహకరించాలని కోరారు కాంగ్రెస్ నేత బీర్ల ఐలయ్య.