దుబ్బాక లో ఓడిన  కేసీఆర్ అహంకారం ఇంకా తగ్గలేదు

దుబ్బాక లో ఓడిన  కేసీఆర్ అహంకారం ఇంకా తగ్గలేదు
దుబ్బాక లో ఓడిన  సీఎం కేసీఆర్ అహంకారం ఇంకా తగ్గలేదన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్. దుబ్బాక భయంతో GHMC ఎన్నికలను హడావిడిగా నిర్వహించారన్నారు. బీజేపీకి టైం  కూడా ఇవ్వలేదని.. అయినా బీజేపీ కే ప్రజలు అనుకూలంగా తీర్పు ఇచ్చారని తెలిపారు. ఎన్నికలు అయిన తర్వాత కూడా మేయర్ ను ఎందుకు ఎన్నుకోవడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్. ఎన్నికల ఫలితాలు వచ్చి ఇన్ని రోజులైనా GHMC  సమావేశాన్ని ఎందుకు ఎన్నికల సంఘం జరపడం లేదన్నారు. సిగ్గులేకుండా మా బీజేపీ కార్పొరేటర్లకు ఫోన్ లు చేసి 5 కోట్లు, 6 కోట్లు ఇస్తాం అంటున్నారని అన్నారు బండి సంజయ్. కేసీఆర్ నువ్వు గెలిగితే మేము గెలకాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో అంటూ హెచ్చరించారు. మీ కార్పొరేటర్ లు మా పార్టీ లోకి వస్తాం అంటున్నారు..అయినా మేము చేర్చుకోవడం లేదని అన్నారు. మేము స్టార్ట్ చేస్తే మరోలా ఉంటుందన్నారు. రాష్ట్ర పోలీసులను సీఎం కేసీఆర్  జీరోలను చేస్తున్నారని ఆరోపించారు. కొంత మంది పోలీస్ లకు చెప్తున్నాం..ప్రజల కోసం పని చేయండి…కేసీఆర్ కోసం కాదు అని అన్నారు సంజయ్.TRS నేతలు చేయాల్సిన పని మీరు చేయకండి అని అన్నారు. శాంతిభద్రతలపై సీఎం చేతులెత్తేశారు… సమస్య వస్తే అధికారులే బలి అవుతారని అన్నారు. కొత్తగూడెం జిల్లాలో ఉపాధ్యాయుడే విద్యార్థులపై  లైంగిక వేధింపులకు పాల్పడుతుంటే..పోలీస్ లు స్థానిక టీఆర్ఎస్ నేతలు సంఘటన ను బయటకు రాకుండా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు బండి సంజయ్.