పొయ్యిపై ఉన్న కుక్కర్ తో.. మహిళను కొట్టి చంపాడు..

పొయ్యిపై ఉన్న కుక్కర్ తో.. మహిళను కొట్టి చంపాడు..

సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానంతో  ప్రెషర్ కుక్కర్ తో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరులో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేరళకు చెందిన వైష్ణవ్, దేవా రెండేళ్లుగా బెంగళూరులో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. 

కాలేజీ రోజుల నుంచి వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఉండేది. ఆగస్టు 26 రాత్రి వారిరువురి మధ్య గొడవ జరిగింది. ఉదయం దేవాకు ఆమె సోదరి ఫోన్ చేసినా స్పందన రాలేదు. అనుమానం వచ్చి చుట్టు పక్కల వాళ్లకి ఫోన్ చేయడంతో వాళ్లు పోలీసులకు కంప్లెంట్ చేశారు. 

పోలీసులు వారు నివసిస్తున్న ఇంటి తలుపులు పగలగొట్టి చూసే సరికి దేవా రక్తపు మడుగులో విగతజీవిగా పడిఉంది. వైష్ణవ్ ఆమెను  అనుమానిస్తుండేవాడని, ఈ క్రమంలో ఇద్దరికి తరచూ గొడవలు జరిగేవని చుట్టు పక్కల వారు పోలీసులకు చెప్పారు. 

ఈ క్రమంలోనే ప్రెషర్ కుక్కర్ తో తలపై మోది హత్య చేసి ఉంటాడని అనుమానిస్తూ కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.