మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు

మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు

యాదాద్రి భువనగిరి జిల్లా: మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఎన్నో స్కీంలు వస్తున్నాయని.. వాటిని మత్య్సకారులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఆ శాఖ అధికారులు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన కిసాన్ క్రెడిట్ కార్డు, పశు సంరక్షక, మత్య్స పెంపుపై అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు వెటర్నరీ జేడీ, మత్స్యశాఖ ఏడీ.  నవంబర్ -8న కిసాన్ క్రెడిట్ కార్డుపై మత్స్యకారులకు పర్సనల్ లోన్లు ఇచ్చే కార్యక్రమంలో ప్రారంభమైందని తెలిపారు.  ప్రతి శుక్రవారం లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్యర్యంలో పలు మండలాల్లో కిసాన్ క్రెడిట్ కార్డుపై అవగాహణ సదస్సు ఉంటుందని తెలిపారు. సొసైటీలకు ఎటువంటి షూరిటీ లేకుండా.. రూ.25 వేల నుంచి రూ.లక్షా 60 వేల వరకు తక్కువ వడ్డీతో ఈ కార్డు మంజూరి చేస్తున్నట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ తెలిపారు. కావునా అర్హులు సంబంధిత డాక్యుమెంట్లతో జిల్లా మత్య్సశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధకశాఖ జేడీ, మత్య్సశాఖ ఏడీ, లీడ్ బ్యాంక్ మేనేజర్ తోపాటు వివిధ బ్యాంకుల మేనేజర్లు  ఫీల్డ్ మన్ రవి నాయక్,  సాయి చరణ్, వివిధ సొసైటీల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.