ఇదే ఉత్సాహంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తాం

ఇదే ఉత్సాహంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తాం

హైదరాబాద్: రైతులకు ఉన్న అడ్డంకులను మోడీ తీసేశారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రైతాంగానికి మేలు జరిగేలా కేంద్రం చర్యలు తీసుకుందన్నారు. హిమాయత్ నగర్ లో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ పదాదికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ లో టీఆర్ఎస్ కు రోజురోజుకు ఆదరణ తగ్గుతోందన్నారు. 4 నుంచి 48 కార్పొరేటర్లకు బీజేపీ బలం పెరిగిందని.. ఇదే ఉత్సాహంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేలా ప్రతీ కార్యకర్త పనిచేయాలన్నారు కిషన్ రెడ్డి.