ఫేక్ మెసేజ్ల కట్టడికి ట్రాయ్ కొత్త రూల్

 ఫేక్ మెసేజ్ల కట్టడికి ట్రాయ్ కొత్త రూల్

న్యూఢిల్లీ, వెలుగు: ప్రస్తుతం ప్రతి పనికి స్మార్ట్‌‌‌‌ ఫోన్‌‌‌‌ అనివార్యం అయింది. మొబైల్‌‌‌‌ ఫోన్‌‌‌‌ నిత్యావసర సరుకుగా మారిపోయింది. ఇదే అదనుగా సైబర్‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లు తమ తెలివిని చూపిస్తున్నారు. ఫేక్‌‌‌‌ మెసేజ్‌‌‌‌లు, ఫిషింగ్‌‌‌‌ లింక్స్‌‌‌‌ పంపుతూ డబ్బులను కాజేస్తున్నారు. ఈ క్రమంలోనే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌‌‌‌ ఇండియా (ట్రాయ్‌‌‌‌) ఫేక్‌‌‌‌ మెసేజ్‌‌‌‌ల కట్టడికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మన ఫోన్‌‌‌‌కు వచ్చే మెసేజ్‌‌‌‌లు నిజమైనవేనా.. ఫేకా అని తెలుసుకునేందుకు మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రతి మెసేజ్‌‌‌‌ వెనుక పీ, ఎస్, టీ, జీ అనే ఆంగ్ల అక్షరాలను ఇందుకోసం ఉపయోగించింది. ఆ అక్షరాలను బట్టి వచ్చిన మెసేజ్‌‌‌‌ ఏ కేటగిరీకి చెందినదనే వివరాలను గుర్తించవచ్చు. పీ – ప్రమోషనల్‌‌‌‌, ఎస్‌‌‌‌ – సర్వీస్‌‌‌‌, టీ – ట్రాన్సాక్షనల్‌‌‌‌, జీ – గవర్నమెంట్‌‌‌‌ అని  గుర్తించవచ్చని అధికారులు తెలిపారు.