పోలీసుల అదుపులో కోదండరాం

పోలీసుల అదుపులో కోదండరాం

హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇవాళ  సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ర్యాలీకి పిపునిచ్చింది ఆర్టీసీ జేఏసీ. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు  హైదరాబాద్ లోని అన్ని డిపోల కార్మికులు వచ్చారు. అయితే ర్యాలీకి అనుమతి లేదని అభ్యంతరం తెలిపారు పోలీసులు. ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించిన కార్మికులను అరెస్టు చేశారు. మద్దతు తెలిపేందుకు వచ్చిన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను అదుపులోకి తీసుకున్నారు.