గద్దర్ కుటుంబానికి కోదండరాం పరామర్శ

గద్దర్ కుటుంబానికి  కోదండరాం పరామర్శ

అల్వాల్, వెలుగు: వెంకటాపురంలోని మహా బోధి స్కూల్​లో గద్దర్ సమాధి వద్ద బుధవారం టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గద్దర్ ఇంటికి వెళ్లి.. కుటుంబసభ్యులను పరామర్శించారు. 

ఈ సందర్భంగా గద్దర్​తో ఆయనకున్న అనుబంధాన్ని తలుచుకొన్నారు. రాజకీయ సంబంధాలు, అనుసరించాల్సిన చర్యలపై గద్దర్ ఎక్కువగా మాట్లాడేవారని కోదండరాం తెలిపారు. టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్,  జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, జనరల్ సెక్రటరీ దయాకర్ తదితరులు ఉన్నారు.