భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు ర్యాంకింగ్లో మొదటి స్థానాన్ని కోల్పోయాడు. న్యూజిలాండ్తో జరిగిన రెండు టెస్టుల్లో తక్కువ సోర్కుకే ఔట్ కావడంతో కోహ్లీ ఫస్ట్ ప్లేస్ నుంచి రెండో ర్యాంకుకు పడిపోయాడు. ప్రసుతం 20 పాయింట్లు కోల్పోయి 906 పాయింట్ల దగ్గర 2వ స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవెన్ స్మిత్ 911 పాయింట్లతో మొదటి స్థానం దక్కించుకున్నాడు. మొదటి 10 స్థానాల్లో భారత్ తరుఫున పూజారా 7, అజింకా రహానే 9వ స్థానంలో కొనసాగుతున్నారు.