బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణం వేగవంతం చేయండి

 బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణం వేగవంతం చేయండి

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సమావేశమయ్యారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంతోపాటు సహా బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణం వేగవంతం చేయాలని మంత్రిని కోరారు. నిర్మాణంలో ఉన్న ఎయిమ్స్ కు అదనంగా అవసరమైన మౌలిక సదుపాయాల కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన ఎంబీబీఎస్ విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఉన్న 606 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2020 - 21 సప్లమెంటరీ బ్యాచ్ లో వారందరినీ భర్తీ చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ ప్రారంభానికి రావాలని మాండవీయను కోమటిరెడ్డి ఆహ్వానించారు.