
లారీ ఓనర్ల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ ఫిర్యాదులు!
హైదరాబాద్, వెలుగు: ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ దంపతులకు మంత్రి కేటీఆర్ క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. ఎమ్మెల్యే భర్త హరీశ్ సింగ్ ఇల్లందు సింగరేణి మైనింగ్ ఏరియాలో బొగ్గు తరలింపు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నుంచి డబ్బు డిమాండ్ చేశారంటూ కేటీఆర్కు ఫిర్యాదులు అందినట్టు సమాచారం. లోకల్ లారీలతో పనులు చేయించుకోవాలని, లేకుంటే తమకు కమీషన్ ఇవ్వాలని హరీశ్ సింగ్ బెదిరించినట్టుగా టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నేతలు అంటున్నారు. ఈ తీరుతో సుమారు పది రోజుల పాటు బొగ్గు ట్రాన్స్పోర్టు నిలిచిపోయిందని, సదరు కాంట్రాక్టర్ ఎమ్మెల్యే భర్త తీరుపై కేటీఆర్కు ఫిర్యాదు చేశారని చెప్తున్నారు. ఈ మేరకు కేటీఆర్ రెండు రోజుల కింద ఎమ్మెల్యే దంపతులను హైదరాబాద్కు పిలిపించుకుని, క్లాస్ తీసుకున్నట్టు పార్టీ నేతలు అంటున్నారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యే భర్తను కేటీఆర్ హెచ్చరించినట్టు చెప్తున్నారు. అయితే కేటీఆర్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం వెనుక మరో కారణం ఉందని.. బొగ్గు తరలింపు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ కేటీఆర్కు సన్నిహితుడని అంటున్నారు.