
ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండీస్ హిట్ వికెట్ వెనుదిరిగాడు. శుక్రవారం (మే 30) ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో 6 ఓవర్లలో 66 పరుగులు చేసి లక్ష్యం వైపుకు దూసుకెళ్తున్న గుజరాత్ కు ఏడో ఓవర్ రెండో బంతికి బిగ్ షాక్ తగిలింది. రెండు సిక్సర్లు కొట్టి మంచి టచ్ లో కనిపించిన మెండీస్ షాట్ ఆడే క్రమంలో తన కాలు వికెట్లను తగిలింది. సాంట్నర్ వేసిన బంతిని బ్యాక్ ఫుట్ లో ఆడదామని భావించిన మెండీస్ బ్యాలన్స్ తప్పడంతో కాలు స్లిప్ అయింది. దీంతో స్టంప్స్ ను తగలడంతో రెండు వికెట్లు కింద పడ్డాయి. ఈ వికెట్ తో గుజరాత్ షాక్ లోకి వెళ్ళింది.
కుశాల్ మెండీస్ దురదృష్టకర రీతిలో ఔట్ కావడంతో గుజరాత్ 67 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. మెండీస్ 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం 13 ఓవర్లలో ముంబై 2 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి ముంబైని టెన్షన్ పెడుతుంది. సాయి సుదర్శన్ వీరోచిత ఇన్నింగ్స్ కు తోడు, సుందర్ మెరుపులు మెరిపిస్తున్నాడు. వీరిద్దరూ క్రీజ్ లో ఉండడంతో మ్యాచ్ గుజరాత్ చేతుల్లోనే ఉంది. గుజరాత్ గెలవాలంటే చివరి 7 ఓవర్లలో 81 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి.
►ALSO READ | England Lions vs India A: సెంచరీతో అదరగొట్టిన కరుణ్ నాయర్.. తొలి టెస్ట్ ప్లేయింగ్ 11లో ప్లేస్ ఫిక్స్ !
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ(50 బంతుల్లో 81:9 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు సూర్య కుమార్ యాదవ్(33), బెయిర్ స్టో (47) పవర్ ప్లే లో మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (81) టాప్ స్కోరర్ గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్,ప్రసిద్ కృష్ణ రెండు వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్ కు ఒక వికెట్ దక్కింది.
🚨Kusal Mendis just lost his wicket after hitting the stumps. 😱
— Sumit Kapoor (@moneygurusumit) May 30, 2025
GT’s holding up well for now, but with two Bumrah overs still to come, one quick wicket and Mumbai Indians could be right back in it💥#GTvsMI #MIvsGT #RohitSharma pic.twitter.com/NCHSwaWYSg