England Lions vs India A: సెంచరీతో అదరగొట్టిన కరుణ్ నాయర్.. తొలి టెస్ట్ ప్లేయింగ్ 11లో ప్లేస్ ఫిక్స్ !

England Lions vs India A: సెంచరీతో అదరగొట్టిన కరుణ్ నాయర్.. తొలి టెస్ట్ ప్లేయింగ్ 11లో ప్లేస్ ఫిక్స్ !

ఇంగ్లాండ్ లయన్స్ తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్ లో ఇండియా ఎ బ్యాటర్ కరుణ్ నాయర్ సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లాండ్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ ఇంగ్లాండ్ తో జరగబోయే తొలి టెస్టుకు స్థానం ఖాయం చేసుకునే పనిలో ఉన్నాడు. శుక్రవారం (మే 30)  కాంటర్బరీలో ప్రారంభమైన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 'ఏ' 60 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. కరుణ్ నాయర్ (102) ధృవ్ జురెల్ (6) క్రీజ్ లో ఉన్నారు. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 8 పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ కాసేటికే జైశ్వాల్ 24 పరుగులకి పెవిలియన్ బాట పట్టాడు. ఈ దశలో సర్ఫరాజ్ ఖాన్, కరుణ నాయర్ ముందుకు తీసుకెళ్లారు. భారీ భాగస్వామ్యంతో జట్టును భారీ స్కోర్ కు బాటలు వేశారు. 51 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా వీరిద్దరూ ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ మూడో వికెట్ కు 181 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 

►ALSO READ | IPL 2025: గుజరాత్‎పై చెలరేగిన రోహిత్.. ఒక్క దెబ్బకే IPL హిస్టరీలో రెండు అరుదైన రికార్డ్‎లు

సెంచరీ ఖాయమన్న దశలో సర్ఫరాజ్ 92 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. సర్ఫరాజ్ సెంచరీ మిస్ చేసుకున్నా మరో ఎండ్ లో కరుణ్ నాయర్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ప్రస్తుతం జురెల్ తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ హల్ రెండు.. ఎడ్వర్డ్ జాక్ ఒక వికెట్ తీనుకున్నారు.