IPL 2025: గుజరాత్‎పై చెలరేగిన రోహిత్.. ఒక్క దెబ్బకే IPL హిస్టరీలో రెండు అరుదైన రికార్డ్‎లు

IPL 2025: గుజరాత్‎పై చెలరేగిన రోహిత్.. ఒక్క దెబ్బకే IPL హిస్టరీలో రెండు అరుదైన రికార్డ్‎లు

ముంబై: ఐపీఎల్ 18లో భాగంగా గుజరాత్ టైటాన్స్‎తో జరుగుతోన్న కీలకమైన ఎలిమినేటర్ 1 మ్యాచులో ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ దుమ్మురేపాడు. టైటిల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో హాఫ్ సెంచరీతో రాణించాడు. 50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 81 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్‎లో హిట్ మ్యాన్ రెండు అరుదైన రికార్డులు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో 300 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. 

ఈ మ్యాచ్‎కు ముందు హిట్ మ్యాన్ 299 సిక్సర్ల వద్ద ఉండగా.. ఈ మ్యాచులో 4 సిక్సర్లు కొట్టి ఐపీఎల్‎లో 300 సిక్సర్లు బాదిన తొలి ఇండియన్ బ్యాటర్‎గా అరుదైన ఫీట్ నెలకొల్పాడు. దీంతో పాటుగా ఐపీఎల్‌లో రోహిత్ శర్మ 7000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మ్యాచుకు ముందుకు ఈ రికార్డుకు 8 పరుగుల దూరంలో ఉన్న హిట్ మ్యాన్.. గుజరాత్‎పై 81 రన్స్ చేయడం ద్వారా ఐపీఎల్‎లో 7 వేల రన్స్ కంప్లీట్ అయ్యాయి. తద్వారా ఐపీఎల్ హిస్టరీలో 7 వేల పరుగులు మైలురాయి అందుకున్న బ్యాటర్ల జాబితాలో రోహిత్ స్థానం దక్కించుకున్నాడు. 

►ALSO READ | GT vs MI Eliminator: బ్యాటింగ్‌లో శివాలెత్తిన ముంబై.. గుజరాత్ ఎలిమినేట్ ఖాయమేనా..

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. డూ ఆర్ డై లాంటి ఎలిమినేటర్ మ్యాచ్‎లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‎లో చెలరేగి ఆడింది.  ఓపెనర్ రోహిత్ శర్మ(50 బంతుల్లో 81:9 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు సూర్య కుమార్ యాదవ్(33), బెయిర్ స్టో (47) పవర్ ప్లేలో మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ (81) టాప్ స్కోరర్‎గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్, ప్రసిద్ కృష్ణ రెండు వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్‎కు ఒక వికెట్ దక్కింది.