గచ్చిబౌలిలో చిరుత కలకలం.. కుక్కను ఎత్తుకెళ్లిందంటున్న స్థానికులు

గచ్చిబౌలిలో చిరుత కలకలం.. కుక్కను ఎత్తుకెళ్లిందంటున్న స్థానికులు

హైద‌రాబాద్: నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో చిరుత సంచరిస్తుందనే వార్త కలకలం రేపుతుంది. గచ్చిబౌలిలోని రోడా మిస్త్రీ కాలేజ్‌లో ఓ కుక్కను చిరుత పులి ఎత్తు కెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. శనివారం మద్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో కాలేజీ ఆవరణలోకి వచ్చిన చిరుత‌.. కుక్కను వేటాడి ఎత్తుకెళ్ళినట్టు కాలేజీ సిబ్బంది చెబుతున్నారు. చిరుత సంచారం గురించి సమాచారం అందుకున్న రంగారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారులు… కాలేజీ భవనం పై రక్తపు మరకలను గుర్తించి, పక్కనే ఉన్న గుట్ట మీదకు చిరుత వెళ్లి ఉంటుందని అనుమానిస్తున్నారు. చూట్టూ పెద్ద పెద్ద భవనాలు, ప్రధాన రహదారులు ఉన్న ఈ ప్రాంతలోకీ చిరుత ఎలా వచ్చిందో అని అర్థం కావడం లేదని అధికారులు ఆలోచిస్తున్నారు. ఇందుకోసం ఆ ప్రాంతంలో ట్రాక్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు.