పేదల భూముల్లో సఖీ భవన నిర్మాణం
అడ్డుకున్న స్థానికులు.. తహసీల్దార్పై దాడి
ఇద్దరి ఆత్మహత్యా యత్నం
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: తమ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని రెవెన్యూ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. తహసీల్దార్పై దాడికి పాల్పడ్డారు. ఇద్దరు ఆత్మహత్యకు యత్నించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గుమ్ముడూర్రెవెన్యూ పరిధిలోని గాయత్రి గుట్ట పక్కన 287 సర్వే నంబర్లో 500 గజాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు సఖీ కేంద్రానికి కేటాయించారు. ఆదివారం ఉదయం ఇక్కడ పనులు చేపడుతుండగా స్థానికులు అక్కడికి వచ్చి తమ స్థలంలో నిర్మాణాలు చేయవద్దని అందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు పోలీస్బలగాలతో అక్కడికి జేసీబీలు తీసుకువచ్చి గుంతలు తీయించడం స్టార్ట్చేశారు. దాంతో స్థానికులు వచ్చి పిల్లర్గుంతలోకి దిగి ఆందోళన చేపట్టారు. మరికొందరు జేసీబీలను రోడ్డుపై అడ్డుకుని తహసీల్దార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తహసీల్దార్ఉద్దేశపూర్వకంగానే తమ స్థలాన్ని సఖీ కేంద్రానికి కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు.
తహసీల్దార్ సమీప బంధువుకు ఫాతిమా హైస్కూల్ వెనుక సర్వే నంబర్551లో 2 ఎకరాల భూమి ఉందని, ఎటువంటి వివాదం లేదని ఆ స్థలాన్ని ఎందుకు ప్రభుత్వ ఆఫీసులకు కేటాయించలేదని ప్రశ్నించారు. 80, వంద గజాల స్థలాలున్న పేదలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. కొందరు మహిళలు తహసీల్దార్రంజిత్కుమార్ను తిడుతూ ఆవేశంలో అతడిపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు అడ్డుకుని తహసీల్దార్ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. మరి కొందరు పిల్లర్గుంతలోకి దిగారు. సుభద్ర అనే మహిళా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు గమనించి అదుపులోకి తీసుకున్నారు. బిక్షపతి అనే వ్యక్తి పెట్రోల్ పోసుకున్నాడు. పోలీసులు వెంటనే అతడిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కళ్లలో పెట్రోల్ పోవడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.
పేదలపై జులుం చేయొద్దు: ఎమ్మెల్యే
పేదలపై అధికారులు జులుం చేయొద్దని మహబూబాబాద్ఎమ్మెల్యే శంకర్నాయక్ అన్నారు. బిక్షపతి, సుభద్రను, వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇక్కడ సఖీ కేంద్రానికి స్థలం కేటాయించవద్దని గతంలోనే మినిస్టర్, కలెక్టర్దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. నిరుపేదలకు అండగా ఉంటానని, ఎవరూ ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని చెప్పారు.