కాళ్లుపట్టుకన్నా వదల్లేదు..కోల్కతా అత్యాచార ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి

కాళ్లుపట్టుకన్నా వదల్లేదు..కోల్కతా అత్యాచార ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి

గదిలోకి తీసుకెళ్లారు..బయటికి వెళ్లకుండా లాక్​చేశారు..గదిలో బంధించి దాడి చేశారు.లొంగకపోతే కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారు.నన్ను వదిలేయండి అని కాళ్లు పట్టుకున్నా వదల్లేదు..తనపై ముగ్గురు వ్యక్తులు పైశాచికంగా చేసిన దాడిని పోలీసులకు వివరించింది కోల్కతా లా కాలేజీ అత్యాచార బాధితురాలు.  

బాధితురాలి వాంగ్మూలం..పోలీసు వర్గాల ప్రకారం..జూన్ 25, 2025న లా కాలేజీలో ఫామ్​ నింపేందుకు వెళ్లిన బాధితురాలిని బంధించి ఘాతుకానికి వడిగట్టారు నిందితులు.  యూనిట్ విషయాలను చర్చించాలని బాధితురాలిని, ఇతరులను పిలిపించిని ప్రధాన నిందితుడు మోనోజిత్..తనను పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్​ చేసినట్లు తెలుస్తోంది. బాధితురాలు ఒప్పుకోకపోవడంతో పరిస్థితి హింసాత్మకంగా మారినట్లు తెలుస్తోంది. పూర్వ విద్యార్థి అయిన మోనోజిత్​ మిశ్రా తృణమూల్ ఛత్ర పరిషత్ (TMCP) యూనిట్ లీడర్. లా క్యాంపస్‌లో తన అధికారాన్ని చెలాయించినట్లు తెలుస్తోంది.

బుధవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో యూనియన్ సభ్యులంతా గది నుంచి బయటకు వెళ్లాక..మోనోజిత్ మరో ఇద్దరు నిందితులు బాధితురాలిని గదిలో ఉంచి బయటి నుంచి తలుపు తాళం వేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. 

బాధితురాలిని బలవంతంగా వాష్‌రూమ్ దగ్గరకు లాక్కెళ్లి అత్యాచారం ప్రయత్నించి, శారీరకంగా దాడి చేశారు.ఆమె ప్రతిఘటనప్పటికీ, నన్నొదిలేయండి అని నిందితులు వేడుకున్నా తీవ్రంగా దాడి చేశారు దీంతో బాధితురాలు తీవ్ర భయాందోళనకు గురై ఊపిరి ఆడక ఇబ్బంది పడింది.

బాధితురాలికి మొదట్లో సహాయం నిరాకరించిన దుండగులు..పదేపదే విజ్ఞప్తి చేసిన తర్వాత మాత్రమే ఆమె ఇన్హేలర్‌ను ఉపయోగించడానికి అనుమతించారు. బాధితురాలు తప్పించుకోకుండా కళాశాల మెయిన్​ గేటుకు తాళం వేసి ఉంచారు.తరువాత ఆమెను గార్డు గదికి తీసుకెళ్లినట్లు విచారణలో వెల్లడైంది. 

తాను లొంగకపోతే బాధితురాలి ప్రియుడిని చంపేస్తానని,ఈ సంఘటన గురించి బయటకు చెబితే ఆమె కుటుంబానికి హాని చేస్తానని మోనోజిత్ బెదిరించినట్లు పోలీసులు చెబుతున్నారు. 
మోనోజిత్ బాధితురాలిని రహస్యంగా రికార్డ్ చేసిన వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేశాడని ఆమె సహకరించకపోతే వాటిని బహిరంగంగా పెడతానని బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి.

అరెస్టులు ..

కస్బా పోలీసులు ఈ గ్యాంగ్ రేప్​ కు సంబంధించి ముగ్గురు నిందతులు మోనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్,ప్రమిత్ ముఖర్జీలను అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు కళాశాలలో ప్రస్తుత విద్యార్థులు కాగా, ప్రధాన నిందితుడైన మోనోజిత్ మిశ్రా పూర్వ విద్యార్థి. మిశ్రా తృణమూల్ ఛత్ర పరిషత్ (TMCP)లో క్రియాశీల సభ్యుడు.దక్షిణ కోల్‌కతా లా కాలేజీలో ఆధితప్యం, రాజకీయ పలుకుబడి  ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో లాకాలేజీలో క్లరికల్​ఉద్యోగం చేసినట్లు దానికోసం రాజకీయ పలుకుబడిని ఉపయోగించిన ఆరోపణలున్నాయి. ఈ సంఘటనపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.