డీసీఎంను ఢీకొట్టిన లారీ.. నలుగురు మృతి

డీసీఎంను ఢీకొట్టిన లారీ.. నలుగురు మృతి

రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ దగ్గర మే 14 అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది.  డీసీఎంను సిమెంట్ లోడ్ తో వెళ్తున్న  లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు  మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి వచ్చిన ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

 ఇబ్రహీంపట్నంలో ఒక డీజే ఈవెంట్ ముగించుకొని వస్తున్న డీసీఎంను తుర్కాయంజాల్ చౌరస్తాకు రాగానే  అదే సమయంలో మాచర్ల నుండి  వస్తున్న  సిమెంట్ లోడ్  లారీ  ఢీ కొట్టింది. ఘటనా   స్థలంలో ఇద్దరు మృతి చెందగా.. ఆసుపత్రిలో మరో  ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

మృతులు గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పాత మల్లయ్య పాలెంకు చెందిన నాగసముద్రం సాయి రెడ్డి(22), నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లి కి చెందిన తుమ్మోజు లక్ష్మయ్య(52), నగరంలోని జియాగుడకు చెందిన డీజే ఆపరేటర్ అహినోల్ల మహేష్ కుమార్(23), వేంపల్లి మహేష్ (52) లు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

తాగిన మైకంలో వాహనం నడిపి నలుగురి మృతికి కారణమైన లారీ డ్రైవర్ ను బ్రీత్ అనలైజర్ టెస్ట్  చేయగా 161ఎంజీ ఆల్కహాల్ శాతం వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.