ప్రేమ జంట ఆత్మహత్య

ప్రేమ జంట ఆత్మహత్య

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ ​జిల్లా దోమ మండలానికి చెందిన ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని గుండాలకు చెందిన కృష్ణ(20), అదే గ్రామానికి చెందిన సుజాత(17) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. యువతికి పెండ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ప్రస్తుతం సంబంధాలు చూస్తున్నారు. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాదని తెలిసి సుజాత ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న కృష్ణ అదేరోజు మహబూబ్​నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నచెడులోని చెరువులో దూకి సూసైడ్​ చేసుకున్నాడు.