విశ్వాస పరీక్షలో గెలుస్తాం

విశ్వాస పరీక్షలో గెలుస్తాం

మహారాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ లో ఉద్దవ్ థాక్రే కీలకవ్యాఖ్యలు చేశారు. బలపరీక్షకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. గౌహాతిలో ఉన్న ఎమ్మెల్యేలు ముంబైకి వచ్చి విశ్వాస పరీక్షలో ఎవరికి ఓటేస్తారో ప్రజలే చూస్తారన్నారు. 20 మంది రెబల్ ఎమ్మెల్యేలు తనకు టచ్ లో ఉన్నారన్నారు ఉద్దవ్ థాక్రే. విశ్వాస పరీక్షలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ముంబై వచ్చాక ఆలోచన మారుతుందని కామెంట్  చేశారు ఉద్దవ్ థాక్రే.. ఇక ముంబై నాయక్ నగర్  బిల్డింగ్ కూలిన ఘటనలో మృతుల కుటుంబాలకు కేబినెట్ ప్రగాఢ సానుభూతి తెలిపింది. మరణించినవారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. రేపు కూడా మహారాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతుందని మంత్రి సుభాష్ దేశాయ్ ప్రకటించారు.