పంజాబ్లోని భటిండా జిల్లాలోని రామమండి పట్టణంలోని గాంధీ పార్క్ లో ఏర్పాటు చేసిన 3 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గురువారం అర్ఢరాత్రి ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం పార్కులోకి వచ్చిన కొందరు ధ్వంసమైన మహాత్ముడి విగ్రహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన అనంతరం తలను దుండగలు ఎత్తుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న రామమండి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని చెప్పారు. కెనడాలోని అంటారియో ప్రావిన్స్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన కొద్ది రోజులకే రామమండిలో ఈ సంఘటన జరిగింది.
Punjab | A statue of Mahatma Gandhi situated at a public park in Rama Mandi was vandalised by unidentified miscreants in Bathinda last night. A case under section 379, 427 registered: Harjot Singh, In-charge Rama Mandi PS pic.twitter.com/oyfKZJlMTG
— ANI (@ANI) July 16, 2022